నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలను నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం కార్యవర్గం మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఇటీవలే పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన అధ్యక్షులు పెంట దత్తాద్రి, కార్యవర్గ సభ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో సన్మానించారు. కలిసిన వారిలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందుల మురళి, కన్న దుబ్బరాజ,బాగుల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్ ,కార్యదర్శులు అవధూత రాములు, ఎనుగందుల సుభాష్ ,భూసరవి,కోశాధికారి మోర సాయిలు,ప్రచార కార్యదర్శి బూస శ్రీనివాస్ ,కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి గంగరాజు మరియు కులసంఘం నాయకులు సత్యపాల్,బిల్లా మహేష్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేను కలిసిన నూతన పద్మశాలి సంఘం కార్యవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES