- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
నిజామాబాద్ జిల్లా ప్రియదర్శిని కాలనీలో శ్రీ జగదాంబ, సేవాలాల్ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం తేదీ 6 మార్చ్ 2026 నుండి 8 మార్చ్ 2026 ఆదివారం వరకు జరుగునని డాక్టర్ మోతిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబు సింగ్ మహారాజ్ పౌర పీఠాధిపతి మరియు మహంతి జితేంద్ర మహరాజ్ వస్తున్నారని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బంజారా సోదరులు,సోదరీమణులు అందరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల అధ్యక్షుడు మంగ్త్యా నాయక్, 24 తండాల బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



