- Advertisement -
చెన్నై : ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆఖరు మ్యాచ్లో కెనడాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ సూపర్ సవాల్ సై అనేసింది. మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో కెనడా 173/4 పరుగులు చేసింది. యువరాజ్ శర్మ (110, 65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. ఛేదనలో రచిన్ రవీంద్ర (59 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (76 నాటౌట్) అర్థ సెంచరీలతో రాణించగా 30/2తో కష్టాల్లో పడిన న్యూజిలాండ్ 15.1 ఓవర్లలోనే 176 పరుగులు చేసింది.
- Advertisement -



