No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeట్రెండింగ్ న్యూస్లండన్‌లో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం

లండన్‌లో తెలంగాణ విద్యార్ధి అదృశ్యం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలం, రెంజర్ల గ్రామానికి చెందిన నల్ల అనురాగ్ రెడ్డి విద్యార్థి వీసాపై జనవరిలో లండన్‌కు వెళ్లాడు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. కుమారుడు అదృశ్యం కావడంతో తల్లి హరిత, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లండన్‌లో తప్పిపోయిన తన కుమారుడి ఆచూకి తెలుసుకొని ఇండియాకు రప్పించాలని కోరుతూ హరిత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి వినతి పత్రాన్ని పంపారు. యూకేలోని కార్డిఫ్ ప్రాంతంలో ఈ నెల 25 సాయంత్రం నుంచి తన కుమారుడి జాడ తెలియకుండా పోయిందని హరిత తన వినతి పత్రంలో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad