Sunday, December 28, 2025
E-PAPER
HomeNewsయాసంగి సాగుకు నిజాంసాగర్ నీటి విడుదల

యాసంగి సాగుకు నిజాంసాగర్ నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్

మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా యాసంగి పంటల సాగు కోసం 1200 క్యూసెక్కుల నీటిని సోమవారం ఉదయం 8 గంటల నుండి 15 రోజుల పాటు అలీ సాగర్ కు వదులుతున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున కాలువ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలువలోకి ఎవరు దిగొద్దని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతానికి ప్రాజెక్టులో 17.802 టీఎంసీల నీరు నిలువ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -