- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
పుట్టిన పిల్లలకు డబ్బాపాలకంటే, తల్లిపాలే ఆరోగ్యానికి మంచివాన్ని అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి అన్నారు. గురువారం రెడ్డిపేటలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పుట్టిన బిడ్డలకు తప్పకుండా ముర్రుపాలను అందించాలని, తల్లిపాలే బిడ్డకు రోగనిరోధక శక్తితో పాటు అనేక పోషకాలను అందిస్తుందని, భవిష్యత్తులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని సూచించారు. కార్యక్రమంలో తల్లులు, కిశోర బాలులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -