Friday, June 20, 2025
E-PAPER
Homeజాతీయంప్ర‌ధాని ప్ర‌సంగాలు వినాలంటే ఏవ‌గింపు: తేజస్వి యాదవ్

ప్ర‌ధాని ప్ర‌సంగాలు వినాలంటే ఏవ‌గింపు: తేజస్వి యాదవ్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పీఎం మోడీ మ‌రోసారి బీహార్ ప‌ర్య‌ట‌న‌పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌తిసారి ప్ర‌ధాని మోడీ అబ‌ద్దాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. 200 వ‌రకు చేప‌ట్టిన ర్యాలీలో పీఎం అవాస్త‌వాలు చెప్పార‌న్నారు. బీహార్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుక‌బ‌డింద‌ని, విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి, పారిశ్రామికంగా దేశంలో అన్ని రాష్ట్రాల క‌న్నా కంటే బీహార్ వెన‌కంజ‌లో ఉంద‌ని నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డించినా..11 ఏండ్ల‌ బీజేపీ పాల‌న‌లో త‌మ రాష్ట్రానికి ఏం చేశార‌ని మోడీని తేజిస్వీ యాదవ్ ప్ర‌శ్నించారు. కేంద్రంలో రెండు ద‌ఫాలుగా అధికారంలో ఉండి ఎన్డీయే కూట‌మి బీహార్ అభివృద్ధికి ఏమి చేసింద‌ని శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంగా చేశారు. ప్ర‌తిసారీ అవాస్త‌వాలు మాట్లాడే ప్ర‌ధాని ప్ర‌సంగాలు వినాలంటే ఏవ‌గింపు క‌లుగుతుంద‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సరన్ పర్యటనలో 2015 నుండి కొనసాగుతున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారా లేదా అనేది చూడాల‌ని సెటైర్లు వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -