రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : బైకును కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..సరూర్ నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ధనుంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి బైకుపై ఘట్ కేసర్ లోని ఓ ఫంక్షన్ కు గురువారం వెళ్లారు. ఈరోజు ఉదయం ఉప్పల్ లోని తన నివాసానికి భార్యా, పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ వద్ద కారు వారి బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందగా, భార్యా పిల్లలకు గాయాలయ్యాయి.

Spread the love