Monday, June 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై యూఎస్ దాడుల‌ను ఖండించిన ఉత్త‌ర కొరియా

ఇరాన్‌పై యూఎస్ దాడుల‌ను ఖండించిన ఉత్త‌ర కొరియా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియాలో ఇరాన్ పై దాడుల‌తో ఇజ్రాయిల్ బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆదేశంపై ప‌లు రోజులుగా క్షిప‌ణుల దాడ‌ల‌ను ముమ్మ‌రం చేసింది. మ‌రోవైపు శ‌నివారం రాత్రి ఎలాంటి కార‌ణంలేకుండానే యూఎస్ కూడా ఇరాన్ అణు స్థావ‌రాల‌పై బాంబుల వేసింది. దీంతో అమెరికా ప్రెసిడెంట్ తీరును ప‌లు దేశాల అధినేత‌లు ఖండించారు. తాజాగా ద‌క్షిన కొరియా కూడా అమెరికా ఇరాన్ పై దాడి చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది. ప‌శ్చిమాసియాలో ఇరాన్ పై అమెరికా దాడులు అగ్నికి ఆజ్యం పోశాయ‌ని మండిప‌డింది. మ‌ద్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయిల్ శాంతికి భంగం క‌లిస్తున్నాయి. నిరంత‌ర యుద్ధ కాంక్ష‌తో దాడుల‌కు దిగుతున్నాయ‌ని ఆదేశ విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. యూఎస్ దాడులు ఆదేశ‌ సార్వభౌమ, భద్రతా ప్రయోజనాలను, ప్రాదేశిక హక్కులను ఉల్లంఘించడమనేనని ఉత్తర కొరియా

ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తిమంతమైన బాంబర్లు, క్షిపణులతో అమెరికా విరుచుకుపడింది. 3 అణు కేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 40 క్షిపణులతో దాడులకు దిగింది. బహుళ వార్‌హెడ్ల ఖోరాంశహర్‌-4ను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌ దద్దరిల్లింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్నీ వ్య‌తిరేకిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -