Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమంచు విష్ణుకు నోటీసులు జారీ

మంచు విష్ణుకు నోటీసులు జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇటీవల MBUలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేయగా, SFI నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు, విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ను ఏ1గా, విష్ణును ఏ2గా, మోహన్ బాబును ఏ3గా పేర్కొన్నారు. ఇప్పటికే PROతో పాటు పలువురు బౌన్సర్లను అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -