నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వికలాంగుల పెన్షన్ పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచడం కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. ఎన్పీఆర్డీ 16వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం సంగారెడ్డి పట్టణంలోని గణేష్ నగర్లో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం.బస్వరాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అడివయ్య మాట్లాడుతూ ఎన్పీఆర్డీ వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే, చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం. పోరాటాలు చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వికలాంగులకు అమలు అవుతున్న రిజర్వేషన్స్ ఎత్తివేయడానికి కుట్రలు మోడీ ప్రభుత్వం చేస్తోందన్నారు.
ఎన్పీఆర్డీ జెండావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



