- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సునీల్ మాట్లాడుతూ.. సమాజ సేవలో యువత ముందుండాలని, ప్రతి విద్యార్థి బాధ్యత, క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 24 రోజున ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. యువత మారితేనే సమాజం దానంతట అదే మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జ్ఞానేశ్వర్, వనజ, ప్రదీప్, రామారావు, నవీన్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, సుభాష్, భీమేష్, హైమద్ లు పాల్గొన్నారు.
- Advertisement -