నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ – 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత ఎన్సీసీ ఓపెన్ మహిళా కేటగిరీ కింద ఎంబీబీఎస్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్సీసీలో తనకంటే తక్కువ మెరిట్, నీట్లో తక్కువ మార్కులు వచ్చిన మరో విద్యార్థినికి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీటు కేటాయించడంతో ఆశ్రిత హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఆశ్రిత కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థినికి సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ఫిబ్రవరి 20న తేల్చి చెప్పింది. అంతేకాకుండా వర్శిటీ అధికారుల చర్యలతో ఎంబీబీఎస్ సీటు కోల్పోయి డెంటల్ కోర్సులో చేరిన ఆశ్రితకు నష్టపరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయానికి సుప్రీంలో చుక్కెదురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES