- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం పలువురు టీవీ రోగులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ప్రముఖ దంతా వైద్యులు డాక్టర్ నాగరాజు చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ టీబీ రోగులకు పలు సలహాలు సూచనలు చేశారు. సరైన విధంగా మందులను వాడడం ద్వారా టీబీ నుంచి విముక్తి పొందచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,, మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -