Tuesday, September 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ సలహాదారుడిగా ఎన్​వీఎస్​ రెడ్డి నియామకం

ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్​వీఎస్​ రెడ్డి నియామకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్​వీఎస్​ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నియమించారు. ఆయన స్థానంలో హెచ్ఎండీఏ కమిషనర్​గా పనిచేస్తున్న ఐఏఎస్​ అధికారి సర్ఫరాజ్​ అహ్మద్​ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్వీఎస్​ రెడ్డి అర్బన్ ట్రాన్స్​ పోర్ట్​ సలహాదారుడిగా రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఎన్వీఎస్​ రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎండీగా పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -