- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను డి ఎల్ పి ఓ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పరిశీలించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణం జరుగుతున్న క్రమంలో డబ్బులు అందుతాయని సూచించారు. ఈ పరిశీలనలో డి ఎల్ పి ఓ వెంట ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.
- Advertisement -