Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో క్షుద్ర పూజల కలకలం.!

తాడిచెర్లలో క్షుద్ర పూజల కలకలం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఉరచేరువు కట్ట పరిసరప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రివేళల్లో క్షుద్ర పూజలు చేయడంపై కలకలం రేపింది. పూజలు నిర్వహించిన స్థలం వద్ద ఎర్ర, పచ్చ ముద్దలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు తదితర వస్తువులు ఇస్తారులో పసుపు, కుంకుమ పోయడం, రక్తపు మరకలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్ళాలన్నా ప్రజలు జంకుతున్నారు. కనీసం కర్రతో కూడా ఆ విస్తారు, నిమ్మకాయలు, కొబ్బరికాయలను పక్కకు నెట్టే సాహసం చేయలేకపోతున్నారు. జనసంచారం ఎక్కువగా తిరిగే చోటనే ఈ పనికి పూనుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎవరి ప్రాణాలను హరించడానికి ఎవరు ఈ ప్రయత్నానికి ఒడిగట్టారోనని ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఇంకా ఈ మూఢనమ్మకాలను ఎవరు నమ్ముతారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -