నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాల్టీ రెగ్యులర్ కమీషనర్ గా పదోన్నతితో బదిలీపై వచ్చిన బీ.నాగరాజును శుక్రవారం పలువురు అధికారులు, పార్టీల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. సీఐ నాగరాజు రెడ్డి కమీషనర్ నాగరాజును కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవరావు, బీఆర్ఎస్ నాయకులు యు.ఎస్ ప్రకాశరావు, వాసవి క్లబ్ అద్యక్షులు సత్యవరపు బాలగంగాధర్ లు కలిసి శాలువాతో సత్కరించారు.
వీరి వెంట మండల పరిషత్ పూర్వ అధ్యక్ష ఉపాధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, చిట్లూరి ఫణీంద్ర, కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే బాషా, బీఆర్ఎస్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డీ, సత్యవరపు సంపూర్ణ, జుజ్జూరపు శ్రీరామమూర్తి, కాంగ్రెస్ నాయకులు ముళ్ళగిరి క్రిష్ణ,జల్లిపల్లి దేవరాజు, వాసవి క్లబ్ బాధ్యులు మోహన గంగాధర్, దూపకుంట్ల శ్రీనివాసరావులు ఉన్నారు.