- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట పట్టణ కేంద్రంలో తహసీల్దారు కార్యలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపిడిఓ, ఎన్ఆర్ఈజిఎస్, ఆరోగ్య శాఖ, సాగునీటి శాఖ, విద్యా శాఖ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఇతర శాఖల అధికారులు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే అన్ని శాఖల అధికారులు హాజరై ప్రజల వినతులు స్వీకరించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
- Advertisement -



