- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలో భారీవర్షాలు కురుస్తుండటంతో తిప్పారం బ్రిడ్జిపై నుండి వాగు పొంగిపొర్లుతోంది. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. బ్రిడ్జికి చెట్లు వచ్చి తట్టుకోవడంతో నీళ్లు బ్రిడ్జిపై ప్రవహించడంతో స్థానికుల సహకారంతో ఎస్సై ఆంజనేయులు సంబంధిత అధికారులతో కలిసి జెసిపి సహకారంతో చెట్లను తొలగించారు. తిప్పారం, పెద్ద గుజ్జుల్ వాగును జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ , డిపిఓ, మురళి, తహశీల్దార్ రేణుక చౌహన్, ఎంపీడీవో రాజేశ్వర్ తదిత అధికారులు సందర్శించారు.
- Advertisement -