నవతెలంగాణ – జుక్కల్
నిరక్షరాశులకు అమ్మ బడి వయోజన విద్య కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్న ఏడిగి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల అధికారులు కలిసి నిరక్షరాశులకు అక్షరాభ్యాసం శుక్రవారం నాడు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో శ్రీనివాస్ , ఎం ఈ ఓ తిరుపతయ్య పాల్గొన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఎం ఈ ఓ తిరుపతయ్య , ఐకెపి ఎపిఎం సత్యనారాయణ మాట్లాడుతూ నిరక్షరాశులకు అక్షరాసులుగా తీర్చిదిద్దడానికి మండలంలో అహర్నిశలు కృషిచేసి , నిరక్ష్య రాశుల సంఖ్య తగ్గించడం ఎలా జరుగుతుందో అని వివరించారు. అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు . అక్షరాసుల సంఖ్య పెంచడం తమ విధిగా భావిస్తున్నామని శుక్రవారం నాడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నిరక్షరాశుల భవిష్యత్తు గురించి అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో, ఎంఈఓ , ఐకెపిఎపిఎమ్, జుక్కల్ జెడ్ పి హెచ్ స్ ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు , గ్రామ పెద్దలు శివాజీ పటేల్ , మనోహర్ పటేల్ , గ్రామస్తులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నిరక్షరాశులకు అక్షరాభ్యాసం చేయించిన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES