Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫాం సాగు లాభదాయకం.. 

ఆయిల్ ఫాం సాగు లాభదాయకం.. 

- Advertisement -

– ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు..
నవతెలంగాణ – డిచ్ పల్లి

లోలం గ్రామములో  రైతులకి ఆయిల్ ఫాం సాగు లాభదాయకమని ఈ అవకాశాన్ని సాగుచేసే రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్ సూచించారు. సోమవారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో ఆయిల్ ఫామ్ చేసేవారికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ తదితర వాటిపై అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్  సాగును పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు ఇస్తుందని, కోతులు ముట్టని, పందుల బెడద దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ అని తెలిపారు. ఎన్ ఎం ఈ ఓ-ఓ పి పథకం కింద ఈ కింది సబ్సిడీలు ఉంటాయని వివరించారు.మొక్కలకు 90%రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన & పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంటల‌ సాగు(మొక్కజొన్న,జొన్న, పసుపు,కూరగాయలు,సోయా మొదలగు) చేసినందుకు గాను ఎకరానికి 4200/ చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90% రాయితీ, ఎస్సీ/ఎస్టీ రైతులైతే 100% రాయితీ,5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ప్రశాంత్, అభ్యూదయ రైతులు, గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ కిషన్ ,ప్రి యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి భూమేష్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad