నవతెలంగాణ – డిచ్ పల్లి: ప్రపంచ ఒలింపిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒలంపిక్స్ రన్ ను సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లోని అర్ట్స్ & సైన్స్ కళాశాల నుండి ప్రారంభమై యూనివర్సిటీ ప్లేగ్రౌండ్ వరకు కొనసాగించామని డైరెక్టర్ స్పోర్ట్స్ డాక్టర్ జి. బాలకిషన్ తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్. రవీందర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్. ప్రవీణ్ మామిడల మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఈవెంట్ ఒలంపిక్స్ అని అలాంటి ఒలంపిక్స్ రన్ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొనడం గర్వకారణమన్నారు. యూనివర్సిటీలో ఇలాంటి ప్రతిష్టాత్మక ఒలంపిక్స్ అవేర్నెస్ రన్ కండక్ట్ చేయడం అభినందనీ యమన్నారు.గ్రామీణ యూనివర్సిటీ నుండి విద్యార్థులు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఒలంపిక్స్ స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ రన్ లో మొదటి స్థానంలో ముగ్గురికి మెడల్స్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ రమణ చారి,ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ బి.ఆర్ నేత యూనివర్సిటీ విద్యార్థులు జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు
యూనివర్సిటీలో ఒలంపిక్స్ డే రన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES