నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు శానిటరీ వర్కర్స్ కు ఒకరోజు శిక్షణ తరగతి జుక్కల్ ఎంఈఓ తిరుపతయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతయ్య మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న సానిటరీ వర్కర్స్ కు చేయవలసిన పనులను దిశ నిర్దేశం చేశామని అన్నారు . సానిటరీ పనులను ఏ విధంగా చేయాలి , నేర్పును ప్రదర్శించడం, పనుల నిర్వహణ ఎలా చేయాలనే విషయంపై వారికి శిక్షణ ఇచ్చి విధలను సక్రమంగా నిర్వహించాలనిసానిటరీ వర్కర్స్కు
శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు . సానిటరీ వర్కర్స్ పాఠశాల ప్రాంగణమంతా పరి శుభ్రంగా ఉంచాలని , అహ్లాదకరమైన వాతావరణము సమకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తో పాటు జుక్కల్ మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సానిటరీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.