Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒంటిపూట బడి.. జాగ్రత్త మరి.!

ఒంటిపూట బడి.. జాగ్రత్త మరి.!

- Advertisement -

ఆటలపై దృష్టి సారించేలా చూస్తే మంచిది..
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎండల తీవ్రత పెరుగుతోంది.రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు.ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లి దండ్రులను గ్రహించాలి.

పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి
ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపా ధ్యాయులు,ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగు నీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా..
పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు,కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి.

డ్రైవింగ్ మోజులో..
ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందాని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతు న్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీను లుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి.

జాగ్రత్తలు అవసరం
ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి.మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఎక్కువగా నీరు తీసుకోవాలి: వినయ్ భాస్కర్…తాడిచెర్ల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది.వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు,పండ్లర సాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకో వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -