- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం మండలంలో దుబ్బపేట, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ సదస్సుల్లో టీమ్-1తహశీల్దార్ ఆధ్వర్యంలో దుబ్బపేటలో 58,టీమ్-2 డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆన్ సాన్ పల్లిలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో 139 మొత్తం 197 వివిధ భూ సమస్యలసై వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదికారులు పాల్గొన్నారు.
- Advertisement -