- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని వీరవల్లి గ్రామంలో సోమవారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అందుకోసం భూభారతి రెవెన్యూ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతుల నుంచి 87 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు కంచి మల్లయ్య, సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస్ చారి, ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, గ్రామ రైతులు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -