- Advertisement -
సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్…
నవతెలంగాణ – అశ్వారావుపేట : మండలంలోని గిరిజన జనాభా నివాసాల్లో నిర్వహిస్తున్న ధర్తి అభియాన్ జంజాతియా గ్రామ్ ఉత్కర్మ్ అభియాన్ (డీఏజేజీయూఏ) గ్రామ సభలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలోని వేదాంత పురం లో ఏర్పాటు చేసిన గ్రామసభకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. గిరిజనులకు కావలసిన ఆధార్,ఓటర్, రేషన్ కార్డు,జన్ దన్,బ్యాంకు ఖాతా ఓపెన్,ఉపాధి హామీ కార్డు,కిసాన్ క్రెడిట్ కార్డు, ఆయుస్మాన్ భారత్ కార్డు తదితర కార్డులు జారీ చేయుటకు ఈ సభలు నిర్వహిస్తున్నామని ప్రతీ ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
- Advertisement -