- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని ప్రజానీకానికి అవసరము అయ్యే ఇసుకను ప్రజలు ఏప్రిల్ ఒకటి నుండి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిభందనల ప్రకారం ఆన్లైన్ చేసుకున్న వారికి మాత్రమే ఇసుకకు అనుమతి లభిస్తుందని ఆమె తెలిపారు. ఇకపై ఇసుక రవాణాకు నోడల్ అధికారిగా తహసిల్దార్, స్థానిక సర్పంచ్ ఉంటారని, ప్రజలు తప్పకుండా నిభంధనలు పాటించాలని కోరారు. లేని యెడల చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.
- Advertisement -



