Sunday, June 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి

- Advertisement -

– మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి : సీపీఐ(ఎం), సీపీఐ నిరసన
నవతెలంగాణ-కరీంనగర్‌

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, దేశంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్‌లను ప్రజలు ఖండించాలని సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు డిమాండ్‌ చేశారు. మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి, బూటకపు ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా శనివారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ డెడ్‌లైన్‌ విధించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ఉగ్రవాదులు దేశంపై దాడి చేసి అమాయక ప్రజలను చంపితే.. పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన కేంద్రం.. మన దేశంలో పేద ప్రజల కోసం, సమానత్వం కోసం, అసమానతల పట్ల పోరాటం చేస్తున్న మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని, లేకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో రానున్న కాలంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, గీట్ల ముకుంద రెడ్డి, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు కిన్నెర మల్లమ్మ, పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్‌, ఎడ్ల రమేష్‌, కోనేటి నాగమణి, మచ్చ రమేష్‌ బ్రాహ్మణపల్లి యుగంధర్‌, కొట్టే అంజలి, జి.తిరుపతి, గజ్జల శ్రీకాంత్‌, కాంపల్లి అరవింద్‌, సత్తయ్య, సిహెచ్‌.మురళి, నగునూరు రమేష్‌, గాజుల కనకరాజు, కో0పల్లి సాగర్‌, తిరుమలయ్య, పవన్‌ కండిరాజు, సందేశ్‌, అక్షరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -