- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇచ్చింది విరామమే అని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ‘‘భారత్ నౌకాదళం పరాక్రమాన్ని పాక్ ఇంకా చూడలేదు. ఈ సారి పాకిస్థాన్కు కోలుకునే అవకాశం కూడా ఉండదు. పాక్ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవాదుల్ని అప్పగించాలి. ముఖ్యంగా హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ను అప్పగించాలి’’అని అన్నారు.
- Advertisement -