- Advertisement -
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నవతెలంగాణ – సిరిసిల్ల
అర్హులైన రైతులకు ఆదివారం వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజేశ్వర స్వామి గోశాలలోని 300 కోడె పిల్లలను ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తెలిపారు. పట్టాదార్ పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు సంబంధిత పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తదితర పత్రాలతో గోశాలకు రావాలని, కోడే పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణను సక్రమంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
- Advertisement -