Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆరు నెలలుగా ఒపీఎస్ లకు అందని వేతనాలు.!

ఆరు నెలలుగా ఒపీఎస్ లకు అందని వేతనాలు.!

- Advertisement -

ఇబ్బందుల్లో కార్యదర్శులు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఆరు నెలలుగా వేతనాలు అందక ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం248 గ్రామాలు ఉండగా.. అందులో 224 జిపిలకు కార్యదర్శులున్నారు.ఇందులో 28మంది ఓపీఎస్ లు విధులు నిర్వర్తిస్తున్నారు. మండలంలో మొత్తం 25 జిపిలున్నాయి. ఇందులో 12 గ్రామాలకు కార్యదర్శులున్నారు.ఇద్దరు ఒపిఎస్ లున్నారు. 2021లో విధుల్లో చేరిన వీరు రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో నాలుగేళ్లుగా నామమాత్రపు వేతనంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం బడ్జెట్ విడు దల చేస్తుంది. కాగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి ఇప్పటికీ వేతనాలు రాలేదు. ఆర్డర్ కాపీ ట్రెజరీకి రాకపోవడంతో వేతనాలు విడుదల కానట్లుగా తెలుస్తోంది.

గోటి చుట్టపై రోకలి పోటు..

అసలే ఔట్సోర్సింగ్ ఉద్యోగం,నామమాత్రపు వేతనంతో జీవనం సాగిస్తున్నారు.ఆరు నెలలుగా జీతాలు రాకపోగా, వీరు విధులు నిర్వహించే పంచాయతీల్లో చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ పోయించడం, ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహిస్తే అందుకు సంబంధించిన ఖర్చులు సైతం అప్పులు చేసి వెచ్చిస్తున్నామని పలువురు ఓపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి ఆన్లైన్ సిస్టం ద్వారా ఫొటో దిగి పంపించడంతో పాటు ప్రభుత్వం అప్పగించే ప్రతి పనిని నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ప్రతిరోజు లబ్ధిదారులతో మమేకమై వారికి తగు సలహాలు, సూచనలు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను నిర్దేశిత గ్రూప్లో పోస్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే లబ్దిదారులకు బిల్లులు రాకుండా పోతాయి. వీటిన్నంటిని భరిస్తున్న ఓపీఎస్ లు రాబోయే రోజుల్లో రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో పనిచేస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ,ఏడాదిన్నరగా సర్పంచ్ లు లేక పంచాయతీల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఒక్కొక్కరూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అప్పులు చేసినట్లు పలువురు ఓపీఎస్ లు వాపోయారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img