నవతెలంగాణ – మునుగోడు: ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు అందించడమే తమ లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు పట్టణ పరిధిలోని మిర్యాల సుమలత తోపాటు పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గమును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాల తమ లక్షమని అన్నారు . నియోజవర్గ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పాల్వాయి జితేందర్ రెడ్డి , అనంత స్వామి గౌడ్ , మాజీ మండల పరిషత్ కోషన్స్ సభ్యులు ఎండి అన్వర్ తదితరులు ఉన్నారు.
సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడమే మా లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES