- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్లకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. కళారంగంలో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వారిని ఈ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. కళలు, సామాజిక సేవ, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య వంటి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు.
- Advertisement -



