Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : రైతు భరోసా పథకంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ సమాన న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఎవరు అధైర్యపడవడ్డని, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం తొగుట రైతు వేదికలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, డైరెక్టర్ బాలమల్లు, నాగరాజు, ప్రవీణ్, నర్సవ్వ, సంతోష్, రమేష్, ప్రభాకర్ రెడ్డిలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి, పాగాల కొండల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, యెన్నం భూపాల్ రెడ్డి, మల్లయ్య, భూపాల్ రెడ్డి, భారత్ తేజ, గంట రవీందర్, నర్సింలు, స్వామి, నరేష్, ప్రవీణ్ రెడ్డి, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -