- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కడప నగరపాలక సంస్థ నూతన మేయర్గా 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాక సురేశ్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. గత మేయర్ సురేశ్ బాబుపై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కూటమి ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమైంది.
- Advertisement -



