- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హజ్ యాత్రకు బయల్దేరిన యాత్రికులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచన చేశారు. పాకిస్థాన్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉందని, వారి బుద్ధిని మార్చాలని హజ్ కు వెళుతున్న వారంతా దేవుడిని కోరుకోవాలని సూచించారు. సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ బుద్ధిని తప్పకుండా మారుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆథ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందని చెప్పారు.
- Advertisement -