- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పాక్ సైన్యం ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ పేరుతో ఆఫ్ఘన్ ప్రజలపై వైమానిక దాడులు ప్రారంభించింది. కాబూల్, కాందహార్, పాక్తియా ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల డ్యురాండ్ లైన్ వద్ద ఆఫ్ఘన్ దళాల కాల్పుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించినట్లు పాకిస్తాన్ రక్షణశాఖ తెలిపింది. ఈ పరిణామాలపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, సంయమనం పాటించాలని ఇరుదేశాలకు సూచించాయి.
- Advertisement -



