Friday, October 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకాబూల్‌పై పాక్‌ వైమానిక దాడులు..

కాబూల్‌పై పాక్‌ వైమానిక దాడులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాలు నగరంలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులకు పాల్పడినట్లు సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ నూర్ వలీ మెహసూద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో ఇది అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు.

నిన్న రాత్రి కాబూల్ నగరంలోని సెంట్రల్, ఉత్తర జిల్లాల్లో వరుస పేలుళ్లు సంభవించాయని స్థానిక నివాసితులు తెలిపారు. గుర్తుతెలియని విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయని, ఆ తర్వాత భీకర శబ్దాలతో బాంబులు పడ్డాయని వారు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ దాడుల కారణంగా అనేక మంది పౌరుల నివాసాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు, కాబూల్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించిన మాట వాస్తవమేనని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అంగీకరించారు. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా ప్రశాంతంగానే ఉందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -