- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జడ్చర్ల మున్సిపాలిటీలో సోమవారం పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (39) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త నారాయణపేటలో మెడికల్ షాప్ నడుపుతుంటారని, అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోతుంటారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్, రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



