నవతెలంగాణ – జుక్కల్
సాయి లీల ఆన్లైన్ కేంద్రం నిర్వాహకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అధికారిక కార్యాలయంలో పంద్రాగస్టు సందర్భంగా నిర్వాహకుడు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జెండా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా పండుగను నిర్వహించడం జరిగింది. వచ్చిన అతిథులందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు పెన్నులు , పరీక్ష ప్యాడ్ ను ఉచితంగా అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ గౌడ్, బజరంగ్ ళ్ నాయకుడు అశోక్ , సాయి , జావేద్, మాజీ ఉపసర్పంచ్ భాను గౌడ్ , కాంగ్రెస్, బీ ర్ఎస్ , బిజెపి తదితర పార్టీల ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సాయిలీల ఆన్లైన్ సెంటర్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES