Wednesday, June 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపరాగ్వే అధ్యక్షునికి ఢిల్లీలో ఘ‌న స్వాగ‌తం

పరాగ్వే అధ్యక్షునికి ఢిల్లీలో ఘ‌న స్వాగ‌తం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా పలాసియోస్‌ సోమవారం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఢిల్లీ మంత్రి హర్షవర్ధన్‌ మల్హోత్రా ఘనంగా స్వాగతి పలికారు. ఆయనకు ఢిల్లీలోని పాలం వైమానిక దళ స్టేషన్‌లో గార్డ్స్‌ గౌరవ వందనం చేశారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ప్రధానంగా పరాగ్వే, భారత్‌ల ఇరుదేశాల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సంబంధాలను మరింత పెంచుకునేలా విస్తృత లక్ష్యం దిశగా ఇరు నేతలు చర్చలు జరపనున్నారని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. ఈ పర్యటనలో పరాగ్వే అధ్యక్షుడుతోపాటు మంత్రులు, సీనియర్‌ అధికారులు, వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్‌కి చేరుకుంది.

సెప్టెంబర్‌ 13, 1961 నుంచి పరాగ్వే, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు వాణిజ్యం, వ్యవసాయం, ఔషధాలు, సమాచార సాంకేతిక రంగాలలో సహకారం ఉంది. లాటిన్‌ అమెరికాలో భారత్‌కి పరాగ్వే కీలక భాగస్వామి ఉంది. ఆటోమొబైల్‌ ఔషధ రంగాలలో అనేక భారతీయ కంపెనీలు పరాగ్వేలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -