Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపారా క్వాట్ హెర్బిసైడ్‌ (గడ్డి మందు)పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి

పారా క్వాట్ హెర్బిసైడ్‌ (గడ్డి మందు)పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి

- Advertisement -


నవతెలంగాణ – హైదరాబాద్ : హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ మరియు డాక్టర్స్ అగైన్స్ట్ పెరాక్విడ్ పాయిజన్ కలిసి పారా క్వాట్ అనే హెర్బిసైడ్‌పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాల్సిన అత్యవసర పరిస్థితుల గురించి గౌరవ కరీంనగర్ కలెక్టర్ శ్రీమతి పమెల సత్పతి గారికి వినతిపత్రం సమర్పించారు.:

పారా క్వాట్ అత్యంత విషపూరితమైన ఔషధం; 10-15 మి.లీ తాగిన కూడా మృతి సంభవిస్తుంది.ఇది చాలా వేగంగా గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్ని దెబ్బతీసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఈ గడ్డి మందు తీసుకొని దేశంలో చాలామంది అత్యంత సాధారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . దీనికి విరుగుడు మందు లేకపోవడం కారణం చేత 50% నుంచి 90% వరకు రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ గడ్డి మందు పొలాలపై వేసే క్రమంలో తెలియకుండానే రైతుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతున్నారు పార్కిన్సన్స్ అనే వ్యాధి కూడా వస్తుందని చాలా రీసెర్చ్ సెంటర్స్ నివేదికలు తెలుపుతున్నాయి.

హెచ్‌ఆర్‌డీఏ మరియు డి ఏ పి పి ఇచ్చిన అభ్యర్థనలు:
పారా క్వాట్ ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై తక్షణ నిషేధం విధించాలి.మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను వెనక్కి తీసుకొని సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. పారా క్వాట్ అమ్మకానికి కనీస వయసు 18 ఏళ్లు నిర్ణయించాలి.రైతులకు సురక్షిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.డీలర్లు విక్రయ రిజిస్టర్ నిర్వహించాలి, ఆధార్, భూమి పాస్‌బుక్ చెక్ చేయాలి. మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులకు విక్రయం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.పారా క్వాట్ విష ప్రయోగాలను పర్యవేక్షించేందుకు “పాయిజన్ రిజిస్ట్రీ” ఏర్పాటు చేయాలి.ఈ విష పదార్థాన్ని యూరప్, బ్రిటన్, బ్రెజిల్, చైనా, శ్రీలంక, దక్షిణ కొరియా లాంటి దేశాలు ఇప్పటికే నిషేధించాయి.
ఇచ్చిన అభ్యర్థనకు గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు డా. బండారి రాజ్ కుమార్ (తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్), ఉపాధ్యక్షులు డా. పి. గౌతమ్
మరియు ప్రధాన కార్యదర్శి డా. జి.ఎస్. శరణ్ గారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -