– రూ.12 వేల కోట్లతో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ ప్రారంభం
– మహిళాసాధికారతకు మార్గం చూపేలా అభివృద్ధి
– 93వేల గ్రామీణ సిబ్బందికి గ్రీన్చానల్ ద్వారా వేతనాలు
– పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్క తనదైన ముద్ర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకెళ్తున్నది. అభివృద్ధిలో మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) తనదైన ముద్ర వేస్తున్నది. గ్రామీణ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం, ఉపాధి, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, అధికార వికేంద్రీకరణ వంటి అంశాల్లో తెలంగాణ సర్కారు ముందడుగు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం, పచ్చదనానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మిషన్ భగీరథ పథకం పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది 63,000 పైగా పంపులు, మోటార్లను మరమ్మతు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తాగునీటి సరఫరాలో వృథాను అరికట్టేందుకు మంచినీటి సహాయకుల ద్వారా నియంత్రిత నీటి సరఫరా అందిస్తున్నది. వెయ్యి కోట్ల రూపాయలతో తాగునీటి స్థిరీకరణకు ప్రణాళికలు రూపొందించింది. మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేసేలా ఎప్పటికప్పుడు ఏఈల భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వెయ్యి ఏఈ పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన గ్రామీణ రోడ్ల మరమ్మతులు, నూతన రహదారుల ఏర్పాటు కోసం రూ.12 వేల కోట్లతో కొత్తగా హామ్ విధానం తీసుకొచ్చింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉపాధి హమీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల ఆర్థిక చేయూత పథకాన్ని ప్రారంభించింది. 93,000 గ్రామీణ సిబ్బందికి గ్రీన్ చానెల్ ద్వారా నెలనెలా వేతనాల చెల్లింపు చేసే పద్ధతిని ఈ నెల నుంచే మొదలు పెట్టింది. పంచాయతీ రాజ్ వ్యవస్థలో 900 వరకు కారుణ్య నియామకాలు చేపట్టింది.
మహిళా సాధికారతకు పెద్ద పీట
మహిళా సంఘాల ద్వారా 20 రకాల వ్యాపారాలను విజయవంతంగా నడుపుతున్నది. ప్రతి ఏటా మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.25 వేల కోట్ల రుణాలు ఇప్పిస్తున్నది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్వహిస్తున్నది. కొందరికి మొబైల్ ఫిష్ ట్రక్కులు అందజేసింది. త్వరలోనే మహిళా సంఘాలకు రైస్ మిలుల్లు, గోదాముల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిస్తున్నది. ప్రభుత్వ మద్దతుతో మహిళా సంఘాలు 2.25 లక్షల ఎమ్ఎస్ఎమ్ఈలను స్థాపించాయి. మహిళా సంఘాల గ్రూపు సభ్యులకు రూ.10 లక్షల ప్రమాదబీమా, రూ.2 లక్షల లోన్ బీమా సౌకర్యాన్ని కల్పించింది. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను అమ్ముకునేకుందుకు హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఇందిరా మహిళా శక్తి బజార్ను రూ.9 కోట్లతో నిర్మించింది. స్కూల్ యూనిఫాం కుట్టుపనుల్లో మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని పెంచింది. రూ. 110 కోట్లతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలను చేపడుతున్నది. 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయించి ప్రజలకు రుచికరమైన ఆహారం అందిస్తున్నది. పల్లె ప్రజలకు పట్టం కట్టేలా, మహిళల సాధికారతకు మార్గం చూపేలా మంత్రి సీతక్క నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముందడుగు వేస్తున్నది.
గ్రామ స్వరాజ్యానికి బాటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES