- Advertisement -
- కార్యకర్త పుత్రికల కర్ణవేదనం
- మాజీ ఎమ్మెల్యే పుట్ట దంపతులు
- సాధారణంగా నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఆదుకుంటాం…అండగా ఉంటామని చెబుతుంటారు. ఓట్లు..ఎన్నికల అయిపోయి అధికారంలోకి వచ్చినా రాకపోయినా మళ్లీ ఆ పేదింటి వైపు కానీ కార్యకర్తల వైపు కానీ కన్నెత్తి చూడరు. ఇక నమ్ముకున్న కార్యకర్తలైతే తమ గోడు చెప్పుకోవడం తప్ప కనీసం వారి అవసరాలు తీర్చరు…ఇది నేటి సమాజంలో జరుగుతూనే ఉంది..కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా జరుగుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే తన పార్టీ కార్యకర్త పుత్రిక కర్ణవేదన కార్యక్రమంలో మేనమామ స్థానంలో కూర్చిండి వేడుకను పూర్తి చేశారు. మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జర్పుల ప్రమీల విజేందర్ దంపతుల కుమార్తెలు రాజేశ్వరీ, స్వర్ణలతల కర్ణవేదన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆ ఇద్దరు చిన్నారులకు మేనమామలా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్–శైలజ దంపతులు ముందుండి కర్ణవేదన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు తన కార్యకర్త ఇంట్లో జరిగే వేడుకలకు వీఐపీల వచ్చి వెళ్తుంటారే కానీ ఆ కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉండి ఆ ఇంటిలో ఒక స్థానాన్ని తీసుకుని ముందుకు నడిపించడం ఎక్కడా చూడలేదని, ఇది మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శైలజ దంపతుల గొప్పతనమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
నవతెలంగాణ మల్హర్ రావు
- Advertisement -