ప్రపంచ దేశాలనూ కలిపింది
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ
విశాఖ: యోగాతో శాంతి స్థిరత్వాన్ని సాధించవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం విశాఖలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ”అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతి చ్చాయి. ఈ 175 దేశాల్లో యోగా చేయడం సాధా రణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. గత పదేండ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాల్లో యువకులు దీన్ని అనుసరిస్తు న్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు” అని మోడీ అన్నారు.
”ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి చిరునామా విశాఖపట్నం. ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుంది. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుంది. మనం అన్న భావన మానవత్వాన్ని పెంచుతుంది. ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయి. యోగా వల్ల శాంతి స్థిరత్వం సాధించవచ్చు” అని ప్రధాని పేర్కొన్నారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయ వంతం చేయడంలో ఏపీ మంత్రి లోకేశ్ పాత్ర కీలకమైందని.. కొత్త కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చొరవ ప్రశంసనీయమని మోడీ కొనియాడారు.
విశాఖ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం
”యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం. ఈ ఏడాది విశాఖలో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అదుÄ్భతం” అని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు.
యోగాతో శాంతి స్థిరత్వం
- Advertisement -
- Advertisement -