నవతెలంగాణ – మద్నూర్: బక్రీద్ పండుగను దృష్ట్యా మద్నూర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎస్సై విజయ్ కొండ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా బిచ్కుంద సీఐ నరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్భంగా అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గోవాద చేయకూడదని, ఎవరైనా పశువులు తరలిస్తే సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు. హిందూ, ముస్లిం సోదరులంతా కలిసిమెలిసి సామరస్య పూర్వకంగా పండుగ జరిగే విధంగా సహకరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ల స్వామి, వట్నాల రమేష్, బిజెపి అధ్యక్షులు తెప్ప తుకారం, మైనారిటీ నాయకులు జావిద్ పటేల్, గోశాల అధ్యక్షులు సంజు, యువకులు, గ్రామస్తులు, పోలీసులు పాల్గొన్నారు.
నవతెలంగాణ మద్నూర్
బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మద్నూర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం నాడు శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎస్సై విజయ్ కొండ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బిచ్కుంద సీఐ నరేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు బక్రీద్ పండుగకు గోవాద చేయకూడదని ఎవరైనా పశువులు తరలిస్తే అలాంటి వాటి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఎలాంటి గొడవలకు పాల్పడకూడదని తెలియజేశారు హిందూ ముస్లిం సోదరులంతా కలిసిమెలిసి సామరస్య పూర్వకంగా పండుగ జరిగే విధంగా సహకరించుకోవాలని సూచించారు ఈ శాంతి కమిటీ సమావేశంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ల స్వామి వట్నాల రమేష్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు తెప్ప తుకారం మైనారిటీ నాయకులు జావిద్ పటేల్ గోశాల అధ్యక్షులు సంజు యువకులు గ్రామస్తులు పోలీసులు పాల్గొన్నారు