Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల ఊరేగింపు..

కమ్మర్ పల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల ఊరేగింపు..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో ఆదివారం స్థానిక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకొని భాజా భజంత్రీల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి బస్టాండ్ సమీపంలోని పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు. పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి, పంటలు సమృద్ధిగా పండి గొడ్డు-గోదా, పిల్లా జెల్లా చల్లంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పెద్దమ్మ తల్లికి  మొక్కుకున్నారు. బోనాల ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు కొత్తపల్లి అశోక్, డాక్టర్ రమేష్, లోలపు సుమన్, కొత్తపల్లి అరుణ్, సుంకరి నరేష్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -