- Advertisement -
నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బోనాల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయం నుండి ముదిరాజ్ మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు గ్రామస్తులను ఆకర్షించాయి. బోనాల ఊరేగింపులో ముదిరాజ్ సంఘ సభ్యులతోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -